రోజా- వెంకీ మాట్లాడుకుని 22 ఏళ్లు అయ్యిందా..?
on Jan 18, 2018
సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడో.. ఎక్కడో జరిగి.. మరుగునపడిపోయిన విషయాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. దానికి తోడు పని లేని కొందరు.. ఇలాంటి వాటిని వెతకడమే పనిగా పెట్టుకున్నారు. అలా 22 ఏళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలోని ఓ హీరో, హీరోయిన్ మధ్య జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వారు ఎవరో కాదు విక్టరీ వెంకటేశ్-రోజా.. రోజా తన భర్త సెల్వమణితో కలిసి వెంకటేశ్ హీరోగా.. తాను హీరోయిన్గా చినరాయుడు సినిమా తీద్దామనుకున్నారట. వెంకీని కలవడం.. కథ వినడం.. గ్రీన్సిగ్నల్ ఇవ్వడం అంతా చకచకా జరిగిపోయి ఇక్ సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైంలో.. అర్థాంతరంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. అయితే అదే కథతో.. అదే టైటిల్తో విజయశాంతితో కలిసి వెంకీ చినరాయుడు చిత్రంలో నటించాడు. ఈ విషయం తెలుసుకున్న రోజాకు కోపంతో ఊగిపోయిందట.
ఇదేంటి అని వెంకటేశ్ని అడిగితే.. ఇదంతా నిర్మాతల నిర్ణయమని తన ప్రమేయం లేదని వెంకీ సమాధానం ఇచ్చాడట. కాస్త శాంతించిన రోజా సరేనని సరిపెట్టుకుందట. అయితే ఆ తర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో పోకిరి రాజా సినిమాలో వెంకీ-రోజా జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ కోసమని రోజాను బాంబే తీసుకెళ్లి మూడు రోజుల పాటు షూటింగ్ చేయించకుండా ఖాళీగా ఉంచారట. దీనిపై విసుగు చెంది.. నిర్మాతలను అడిగితే వారి నుంచి సరైన ఆన్సర్ రాకపోవడంతో ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వచ్చేసిందట రోజా. దీంతో షాకైన నిర్మాతలు ఎంతో బుజ్జగించడం.. వెంకటేశ్ స్వయంగా ఫోన్ చేసిన తర్వాతే రోజా తిరిగి షూటింగ్లో పాల్గొందట. తన పట్ల ఇలా వ్యవహరించిన వెంకటేశ్ పట్ల కాస్తంత కక్ష పెంచుకున్న రోజా.. అప్పటి నుంచి నేటి వరకు మాట్లాడింది లేదట. ఈ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఇందులో వాస్తవమెంతో తెలుసుకోనేందుకు సినీ జనాలు ఆరాలు మొదలుపెట్టారట.
Also Read