ప్రభాస్ సక్సెస్ మీట్కైనా వస్తాడా..? భయపడతాడా..?
on Jan 30, 2018
అనుష్క లీడ్ రోల్లో పిల్ల జమీందార్ ఫేం అశోక్ తెరకెక్కించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ భాగమతి విజయవంతంగా దూసుకెళ్తోంది. తొలి వీకెండ్కు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల షేర్ను రాబట్టడంతో పాటు ఓవర్సీస్లోనూ వసూళ్ల పంటను పండిస్తోంది భాగమతి. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోన్న చిత్రయూనిట్ త్వరలో సక్సెస్ మీట్ను నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ వార్త తెలియగానే కొందరు అభిమానుల మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతోంది.
ఈ సక్సెస్ మీట్కు ప్రభాస్ వస్తాడా అని.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత సంస్థ.. ఈ బ్యానర్లో నిర్మించిన అన్ని సినిమాల ఆడియో ఈవెంట్లకి యంగ్ రెబల్స్టార్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇక జేజేమ్మ అనుష్కతో ప్రభాస్కి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చేసే ప్రభాస్ భాగమతి పాటల వేడుకకి రాలేదు.. మరి ఈసారి తప్పకుండా అటెండ్ అవుతాడా అంటూ ఫిలింనగర్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని.. అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని వారిద్దరు ఖండించినప్పటికీ.. పుకార్ల జడివాన మాత్రం ఆగడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో అనుష్కతో ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందని ప్రభాస్ భయపడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పోని సాహో షూటింగ్లో బిజీగా ఉన్నాడా అంటే.. సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న ఇంటిలిజెంట్ ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేసి.. ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్కు వెళ్లి సొంత సినిమా ఈవెంట్కు వెళ్లకపోతే... సినీ సమాజానికి రాంగ్ మేసేజ్ వెళ్తుందని యంగ్ రెబల్ స్టార్ భావిస్తున్నాడట. వెళితే ఒక గోల.. వెళ్లకపోతే ఇంకో గోల.. ఇప్పుడెలా అని ప్రభాస్ లోలోపల మదనపడుతున్నాడట. లేదంటే ప్రభాస్ బాధ చూసి యూవీ క్రియేషన్స్ వాళ్లే సక్సెస్ మీట్ను ఎత్తేస్తారా..? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.