మళ్లీ నోరు జారిన బన్నీ..!!
on Dec 26, 2017
తమ్ముడు అల్లు శిరీష్ ఒక్క క్షణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్, మెగాభిమానుల్ని మరొకసారి కవ్వించే వ్యాఖ్యలు చేసాడు. అసలు బన్నీ స్పీచే తేడా గా ఉంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మెగా ఫాన్స్ కి థాంక్స్ చెప్పి, వెంటనే నన్ను అభిమానించే ఫాన్స్ కి కూడా థాంక్స్ అని చెప్పడంలో బన్నీ ఆంతర్యం ఏంటో అని కొందరు పెదవి విరుస్తున్నారు.
నాగబాబు గురించి మాట్లాడుతూ, "చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన తరపున వచ్చిన నాగేంద్ర బాబు గారికి థాంక్స్," అన్నారు. అసలు బన్నీ ఉద్దేశ్యం ఏంటి? చిరంజీవి చెబితేనే నాగబాబు వచ్చారా? లేకపోతే రాకపోయేవారా? అని మెగా ఫాన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో అభిమానులతో విరోధం కొని తెచ్చుకున్న అల్లు అర్జున్, ఫాన్స్ పై మరొకసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
"ఎవరయినా మాట్లాడేటపుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. మీరు ఎంతయినా అరవొచ్చు, అసలు ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరుస్తారని. కానీ, మనిషి మాట్లాడేటప్పుడు కాదు. ఒకరి ఫీలింగ్ చెప్పేటప్పుడు అడ్డుపడకూడదు. అది ఎవరి గురించయినా కావొచ్చు... నాకనవసరం. ఆ విషయంలో నేను ట్రిప్ అవుతాను... ఆ విషయం మీకు తెలుసు," అని అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలు రైటా, రాంగా అనే విషయం పక్కన పెడితే, పబ్లిక్ ఈవెంట్స్ లో ఫాన్స్ ముందు మాట్లేడేటప్పుడు కాస్త జాగర్త పడటం కరెక్ట్ అని అంటున్నారు. మరి, బన్నీ ఈ విషయం ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో!