మంచి దూకుడు మీదున్నాడు కుర్రాడు
on Jul 18, 2017
మన హీరోల్లో ఏదో మార్పొచ్చినట్టుంది. మొన్నటి వరకూ పీస్ ఫుల్ గా ఏడాది ఓ సినిమా చేసుకుంటూ వెళ్లేవారు. ఇప్పుడు ఉన్నట్టుంది స్పీడ్ పెంచారు. ఓ సినిమా సెట్ లో ఉండగానే... మరో సినిమాను పట్టాలెక్కిచ్చేస్తున్నారు. పవన్, మహేశ్ ..ఇద్దరూ ఈ విషయంలో మిగిలిన స్టార్ హీరోలంటే ముందున్నారని చెప్పాలి.
ఓ వైపు పవన్ త్రివిక్రమ్ సినిమా చేస్తూనే మరో వైపు సంతోష్ శ్రీనివాస్ సినిమా కథ చర్చల్లో బిజీగా ఉన్నారు. ఇక మహేశ్ అయితే.. పవన్ కంటే ఓ అడుగు ముందే ఉన్నాడని చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం నిర్మాణం చివరి దశలో ఉండగానే... ‘భరత్ అను నేను’చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేశారు. ఈ రెండు చిత్రాలూ నిర్మాణంలో ఉండగానే.. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తాను చేయబోయే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టేశారు. ప్రస్తుత తరుణంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్లూ ఇంత వేగంగా సినిమాలు చేయడం నిజంగా పరిశ్రమకు శుభ పరిణామమే అనాలి.
పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మహేష్ చేయబోయే చిత్రం ఆద్యంతం అమెరికా నేపథ్యంలో సాగుతుందట. అందుకు వంశీ అప్పుడే లొకేషన్లను కూడా సెలక్ట్ చేసుకొచ్చేశారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘స్పైడర్’సినిమాకు సంబంధించిన మహేశ్ వర్క్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మహేశ్ దృష్టి మొత్తం ‘భరత్ అను నేను’ మీదే. ఈ సినిమాకు సంబంధించిన తన వర్క్ కూడా దాదాపు పూర్తి చేసి పైడిపల్లి వంశీ సినిమా సెట్ లోకి అడుగుపెడతారు మహేశ్. ఈ లోపు మహేశ్ లేని సన్నివేశాలు తీసేయాలనుకుంటున్నారు వంశీ. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించే అవకాశాలున్నాయి.
Also Read