రాగి పూరీలు

 

 

కావలసిన పదార్థాలు:

రాగిపిండి                                          - ఒక కప్పు
గోధుమపిండి                                    - ఒక కప్పు
నెయ్యి                                              - రెండు చెంచాలు
ఉప్పు                                               - తగినంత
నూనె                                               - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ఓ బౌల్ లో రాగిపిండి, గోధుమ పిండి వేసి బాగా కలపాలి. దీనిలో తగినంత పు్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. ఈ పూరీల్ని నూనెలో వేయించుకోవాలి.

- Sameera