సామల దద్ధ్యోదనం

 

 

 

కావలసినవి:  

సామలు - అర కప్పు
పెరుగు - ముప్పావు కప్పు
నీళ్లు - 2 కప్పులు
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
నెయ్యి లేదా నూనె - 1 టీ స్పూను
కొబ్బరి పాలు - పావు కప్పు
ఉప్పు - తగినంత
ఆవాలు - అర టీ స్పూను
అల్లం తురుము - ఒక టీ స్పూను
తరిగిన పచ్చి మిర్చి - 2
క్యారట్‌ - 3 టీ స్పూన్లు
మినప్పప్పు - అర టీ స్పూను
కరివేపాకు - 2 

 

తయారుచేసే విధానం:

ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి.

ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. కొబ్బరి, పెరుగు, పాలు జత చేసి కలియబెట్టాలి.

స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి వేడి అయినతరువాత. ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, మినప్పప్పు,  అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి.

క్యారట్‌ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలుపుకోవాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి...

అంతే సామల దద్ధ్యోదనం రెడీ.. దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది.