నవరాత్రులు మూడవరోజు  (గోరు మీటీలు)

 

 


కావలసిన పదార్దాలు:
మైదా                                                            - 1 గ్లాస్ 
బొంబాయి రవ్వ                                             - 4 చెంచాలు 
బటర్                                                            - 2 చెంచాలు 
ఉప్పు                                                            - కొద్దిగా 
చెక్కర, లేదా బెల్లం                                       - 1 1 /2 గ్లాసు 
ఇలాచీపొడి                                                    - 1/4 స్పూను 

 

తయారీ విధానం:

* మైదాలో బొంబాయి రవ్వ ఉప్పు కలిపి బటర్ వేడి చేసి పూర్తిగా కరిగాక ఈ పిండిలో వేసి కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి.

* దానిని 20ని" పాటు  మూతపెట్టి నానబెట్టాలి. ఇలాచీపొడి కొట్టి ఉంచుకోవాలి. /p>

* ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దని చిన్న ఉండలుగాచేసుకొని... వాటిని కోలగా బలపంలా చెయ్యాలి. 

* ఈ బలపాలు మన మధ్య వేలు పొడవు మందంగా ఉండాలి. వాటి మద్య పై నుంచి క్రిందని నొక్కి నూనె చేతితో మొదటి రెండు  వేళ్ళు బయటి వైపును.. బోటకనవేలు లోపల నొక్కుతూ గోరుతో మీటాలి. 

* ఇవి చాలా అందంగా నున్నగా వస్తాయి. ఇలా చేసుకున్నవి ప్రక్కన ఉన్న పేపరుపై ఉంచుకొని మరోటి చేసుకోవాలి. ఇలా మొత్తం గోరు మీటీలు తయారుచేసుకున్నాక వేడి నీటిలో దోరగా వేయించుకోవాలి. 

* పూర్తిగా లోపల నుండి వేగాక పేపరు పైకి తీసుకుంటే నూనె పూల్చేసుకున్నక చెక్కర లేదా బెల్లం తీగపాకం వచ్చాక  ఇలాచీపొడి జల్లి ఈ గోరు మీటీలు ఒకొక్కటిగా పాకంలో వేస్తూ అటు ఇటు అవి విరిగి పోకుండా తిప్పుతూ పాకం పూర్తిగా వాటిపై అంటుకునేలాచూడాలి. 

* చల్లారాక డబ్బాలో సర్దుకోవాలి. ఇవి చూడటానికి చాలా బావుంటాయ. రుచి ఇంకా బావుంటుంది.

- భారతి