చేగోడీలు (సంక్రాతి స్పెషల్)

 

 


కావలసినపదార్థాలు:

బియ్యపు పిండి                                   - 3గ్లాసులు
మైదా                                                 - 1గ్లాసు
నెయ్యి                                                - 50గ్రా
వాము                                                - 1/2టీస్పూను
పసుపు                                              - 1/4టీస్పూను
కారంపొడి                                           - 1/2టీస్పూను
ఉప్పు                                                - తగినంత
నూనె                                                 - వేయించడానికి సరిపడినంత

 

తయారుచేసే పద్ధతి :

*ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.

* దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.

* ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.

* పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి లేదా ఒక పీటమీద సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు సిద్ధం.

 

- Vissa Nagamani