RELATED NEWS
NEWS
రాళ్లబండి మృతికి నాట్స్ సంతాపం

 

రాళ్లబండి కవితా ప్రసాద్‌ మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సంతాపం తెలిపింది. తెలుగు సాహిత్య రంగానికి రాళ్లబండి కవితాప్రసాద్ లేని లోటు తీర్చలేనిదని నాట్స్ అభివర్ణించింది.అష్టావధానం, నవరసావధానం, శతావధానం, ద్విశతావధానం సహా ఐదు వందలకు పైగా అవధానాలు నిర్వహించిన రాళ్లబండి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించారని నాట్స్ పేర్కొంది. ఒంటరి పూలబుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయం వంటి అనేక పుస్తకాలు రాసిన విషయాన్ని నాట్స్ గుర్తు చేసుకుంది. తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషాభివృద్ధికి రాళ్లబండి ఎంతో సేవ చేశారని నాట్స్ కొనియాడింది. రాళ్లబండి మృతికి నాట్స్ సంతాపంతో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు నాట్స్ అధ్యక్షుడు రవి అచంట ఓ ప్రకటనలో తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;