RELATED NEWS
NEWS
గుంటూరు ప్రవాస భారతీయ వేదిక ఆవిర్భావం

గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధి మరియు గుంటూరు జిల్లా ప్రవాసుల సంక్షేమమే ధ్యేయంగా డల్లాస్, USA నగరంలో గుంటూరు జిల్లా ప్రవాస భారతీయ వేదిక (గుంటూరు NRI ఆర్గ్ ) ఆవిర్భవించింది.


అమెరికా మరియు ఇతర దేశాలలో నివసిస్తున్న జిల్లా ప్రవాసులందరినీ ఒక్క త్రాటి మీదకు తెచ్చి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చెయ్యాలని, సాంస్కృతిక, కళా, క్రీడా మరియు విద్యా రంగాలలో గుంటూరు జిల్లా ఘన వారసత్వాన్ని భావి తరాలకు అందించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించారు. గుంటూరు జిల్లా నుండి వెళ్లి ప్రపంచంలో పలు దేశాలలో ఎంతో అభివృద్ధి సాధించిన లక్షలాది మందిని జిల్లా అభివృద్ధి మరియు ప్రవాసుల సంక్షేమం అనే లక్ష్యాలతో సంఘటితం చెయ్యాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.


ఈ లక్ష్య సాధనలో మొదటి అడుగుగా DALLS నగరంలో ఒక సన్నాహక సమావేశాన్ని ఆదివారం (08/25/2012) నాడు IRVING లోని హాట్ బ్రెడ్స్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని సంస్థ  ప్రతినిధి సూర్యదేవర రామానాయుడు తెలియజేశారు. నగరంలోని గుంటూరు జిల్లా ప్రవాసులు ఈ సమావేశంలో పాల్గొని సంస్థ విధి విధానాలు మరియు లక్ష్యాలను చర్చించవలసిందిగా సంస్థ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరముల కోసం info@gunturnri.org కు ఈమెయిలు పంపవలసిందిగా అభ్యర్థించారు. 

TeluguOne For Your Business
About TeluguOne
;