RELATED NEWS
NEWS
ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆటా వారి శుభాకాంక్షలు

అమెరికా తెలుగు అసోషియేషన్ సభ్యుల తరపున ఆటా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేందర్ జిన్నా ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం పై తమ ఆనందాన్ని మరియు టీమ్ మెంబర్స్ అందరికీ తమ శుభాకాంక్షలను అందచేశారు. భారతదేశం యొక్క గౌరవాన్ని మరింత పెంచిందని, రాబోవు కాలంలో ఈ విజయం యొక్క ప్రభావం చూపుతుందని అన్నారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ని, మ్యాన్ ఆఫ్ ది టోర్నీ యువరాజ్ సింగ్ కు తమ ప్రత్యెక అభినందనలు తెలిపారు.

ఈ టోర్నమెంట్ ఆద్యంతం నిలకడగా ఆడుతూ విజయాలు సాధించి ముఖ్యంగా ఫైనల్ లో శ్రీలంక పై విజయం సాధించటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;