కింగ్మేకర్ గా అవతరిస్తా: బాబా రామ్దేవ్
హైదరాబాద్: తాను 2013 నాటికి కింగ్మేకర్గా అవతరిస్తానని బాబా రామ్దేవ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేశరాజకీయాలను శాసించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి, పక్షపాత వైఖరి తగ్గితే తెలంగాణ సమస్యే ఉండదన్నారు. దేశంలోని మంత్రులంతా కార్పోరేట్ కంపెనీలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సినీ తారలెవరూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలేదని విమర్శించారు. రిజర్వేషన్లతో ఎటువంటి అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 500, వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్దేవ్ డిమాండ్ చేశారు.

