పీఆర్పీని వీడనున్న ‘భూమా’ దంపతులు!
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి మరో దెబ్బ తగలనుంది. పార్టీలో బలమైన నాయకులుగా ఉన్న భూమా నాగిరెడ్డి దంపతులు పార్టీకి దూరం కానున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ ఉద్యమాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ మరింత నీరసించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన వారు భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో పార వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ పిడుగులాంటి వార్తను పార్టీ అధినేత చిరంజీవికి వినిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు, ఈ మేరకు ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.


inta late gana