|

మైదాన ప్రాంతాల్లో వర్షం

Roadజమ్మూ కాశ్మీర్లోని శిఖర ప్రాంతాల్లో భారీగా హిమపాతం పడుతుంటే, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులుగా అదే పరిస్ధితి. చాలా ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర హిమపాతం పేరుకుపోయింది.  దీంతో బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  ప్రముఖ పుణ్యక్షేత్రం అమరనాథ్‌ వద్ద మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.  మరో 24 గంటల పాటు హిమపాతం, వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాశ్మీర్‌ ముఖద్వారమైన జవహర్‌టన్నెల్‌ వద్ద భారీగా మంచుకురవడంతో జమ్మూ -శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు.  ఈ రహదారిపై 500 వాహనాలు చిక్కుకుపోయాయి. మరోవైపు రాజస్ధాన్‌లో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి.  పంజాబ్‌, హర్యానాల్లో కూడా చెదురుమదురుగా చిన్నపాటి జల్లులు పడుతున్నాయి.

  • Share/Bookmark

Tags: , , , , , ,

Related News

» శిశువుల అమ్మకాలు... పట్టించుకొని ఐసిడిఎస్

» కాలానికి అనుగుణంగా 3జీ సేవలు

» బెజవాడలో సినీఫక్కిలో చోరీలు

» తీర్మాన ఆమోదం అప్రజాస్వామికం : చిరు

» నదిలో బస్సుపడి 18మంది మృతి..

» పదవికోసమే ఏకపక్ష నిర్ణయాలు

» పార్టీ నిర్ణయానికి కట్టుబడదాం

» తీవ్రమైన ఉద్యమానికి శ్రీకారం

» 19న తెలుగు చిత్రపరిశ్రమ బంద్

» ఊరిస్తున్న రోశయ్య విస్తరణ

Leave a Reply