|

ప్రకటనలో జాప్యం

Pillaiన్యూఢిల్లీ: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రటనలో జాప్యం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించిన తర్వాతనే కమిటీ విధివిధానాలు వెల్లడవుతాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లై చెప్పారు. కాగా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ట్రపరిస్థితిపై సంప్రదింపుల కమిటి విధివిధానాలపై సోమవారం నాడు హోం మంత్రి చిదంబరం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై తుది కసరత్తు జరిపారు. సమావేశానంతరం హోం శాఖ కార్యదర్శి పిళ్ళై మీడియాతో మాట్లాడారు.  అయితే కాంగ్రెస్ కోర్‌కమిటి సమావేశం తర్వాత ప్రకటన ఉండవచ్చని ఆయన చెప్పారు. కమిటి కాలపరిమితిని ఏడాదిలోపు ఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు.  అయితే కమిటీ విచారణకు సమయం సరిపోకపోతే మరికొంత కాలం పొడిగించే అవకాశం లేకపోలేదన్నారు. మొత్తానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని హోం శాఖ కార్యదర్శి పిళ్ళై వివరించారు. విధివిధానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Share/Bookmark

Tags: , , , , , , ,

Related News

» నియంత్రణకు కఠిన చర్యలు

» "రెండిళ్ల' డాక్టర్‌పై ఫిర్యాదు

» ఎమ్మెల్యే భార్యగా ఒప్పుకోవాలంట!

» టీవీ యాంకర్‌గా రాములమ్మ!

» ఎట్టకేలకు రాజస్దాన్‌కు తొలి విజయం

» ట్రాన్స్ కో కు షాకిచ్చిన ప్రభుత్వం

» నేపాల్ మాజీ ప్రధాని కన్నుమూత

» ప్రభుత్వం పారిపోయింది : చంద్రబాబు

» అసెంబ్లీ సోమవారానికి వాయిదా

» తొగాడియా అరెస్ట్

Leave a Reply