ఫౌండేషన్ సభ్యుడిగా బాలకృష్ణ
హైదరాబాద్: నందమూరి బసవతారక రామారావు కేన్సర్ ఫౌండేషన్ సభ్యుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా కేన్సర్ వ్యాధి నియంత్రణ కోసం కృషి చేస్తున్న కేన్సర్ ఫౌండేషన్ సభ్యుడిగా ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత, సినినటుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణను ట్రస్ట్ ఎంపిక చేసింది. గతంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, శనివారం సభ్యుడిగా పాల్గొనాలంటూ బాలకృష్ణకు ఆహ్వానం పంపామని మేనిజింగ్ ట్రస్టీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు తెలిపారు. సమావేశానికి తొలిసారిగా హాజరైన బాలకృష్ణ కేన్సర్ ఫౌండేషన్కు విరాళంగా రూ. 50 లక్షలు ఇచ్చారు. బాలకృష్ణకు “నిధుల సమీకరణ’ కమిటీలో మరో భాధ్యతను అప్పగిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

