మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు.  మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది. అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.   కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.     నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.   తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 11:57AM

అలీ ఎక్కడ? కనిపించడేం?

జగమెరిగిన కమేడియన్ అలీ..  ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో  పవన్ కల్యాణ్ వంటి మిత్రుడిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. జనసేనానితో రాజకీయ ప్రవేశంపై అలీ చర్చించారు. అలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో అంతా భావించారు. కానీ అక్కుంబుక్కుం అంటూ అలీ జగన్ పంచన చేరాడు. దీనిపై మనవాళ్లనుకున్న వారు, మన నుంచి సహాయం పొందిన వారూ కూడా మోసం చేశారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. అయితే అప్పట్లో అలీ పవన్ మాటలకు చాలా ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారూ!  మీ నుంచి నేనేం సహాయం పొందానో చెప్పాలి? డబ్బులిచ్చారా? పోనీ సినిమాల్లో వేషాలిచ్చారా? అని ప్రశ్నించి, తాను స్వయంకృషితో ఎదిగాననీ, ఎవరి నుంచీ సహాయం పొందలేదనీ చెప్పుకున్నారు అలీ. సరే అందతా వేరే విషయం. అలీ జగన్ గూటికి చేరారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి 2019 ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వకుండా చేయిచ్చారు జగన్. అయితే మంచి పదవి ఇస్తానంటూ ఐదేళ్ల పాటు అలీని ఆశల పల్లకీలో ఊరేగించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్ అలీని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మరీ పదవిపై హామీని పునరుద్ఘాటించారు. ఆ రెండు సందర్భాలలోనూ సినీ పరిశ్రమ విషయంలో పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం.  సరే చివరికి ఆలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా.. కంటి తుడుపు చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్. అయితే 2024 ఎన్నికలలో   అలీ పోటీ షూర్ అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెరమీదకు వచ్చింది. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాకా చూస్తే అలీ మళ్లీ కాట్రవల్లీయే అయిపోయారు.  ఇప్పటికి తత్వం బోధపడిందో ఏమో.. అలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు.  ఈ మధ్యే ఓ టీవీ చానల్ లో ఆయన నిర్వహించే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు. ఒక వేళ పోయినా ఎన్నికలలో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. చూస్తుంటే అలీ ఆ సలహాను తుచ తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 
Publish Date: Apr 25, 2024 11:11AM

కూటమికే యువత జై!

వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత పందేరం చేసే హక్కు, అధికారం జగన్ కు ఎక్కడిదని యువత నిలదీస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోకుండా.. అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచీ మరో సారి అధికారం కోసం ఉచిత పందేరాలే శరణ్యం అంటూ సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి చేరిన వైనాన్ని యువత గుర్తించారు. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలస వెళ్లాల్సిన అవసరం మాకేంటి అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా మద్దతు తెలుగుదేశం కూటమికే నంటూ జై కొడుతున్నారు.  మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే  రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం ఉందంటున్నది ఏపీ యువత.   మరీ ముఖ్యంగా తాజాగా నమోదైన కొత్త ఓటర్లయితే.. ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు చాలు. ఇక అనుభవజ్ణుడైన చంద్రబాబుకే మా మద్దతు అంటున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలలో తొలి సారి ఓటు వేయడానికి తమ ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య కోటీ పదిలక్షల పైనేనన్నది ఓ అంచనా.   గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అనేక కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి. దానికోసం ఆయన  ఎంతో కృషి చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కోసం దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కదిలిన వైనాన్ని చూపుతూ ఆయన విధానాలు వేలాది, లక్షలాది మందికి ఐటీలో ఉన్నతోద్యోగాలు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయంలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ-అంతర్జాతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర-కోస్తా నిరుద్యోగ యువకులకు, బయట రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా పోయిందని చెబుతున్నారు.   అయితే  వైసీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విధానాల కారణంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతిని యువత ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ మద్దతు చంద్రబాబుకే. తెలుగుదేశం కూటమికే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.    
Publish Date: Apr 25, 2024 10:41AM

ఖ‌మ్మం లోక్ సభ అభ్య‌ర్థిగా పొంగులేటి వియ్యంకుడు.. కాంగ్రెస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్  హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చివ‌ర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. త‌ద్వారా పార్ల‌మెంట్ ప‌రిధిలోని రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచించిందని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.    తెలంగాణ‌లో మొత్తం 17లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల విజ‌యంకోసం కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అయితే  ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. గురువారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుండ‌టంతో బుధ‌వారం రాత్రి  మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఖమ్మం  లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం భారీ  క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప‌రిశీలించింది. జిల్లాలోని పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన అధిష్టానం.. మెజార్టీ అభిప్రాయాల మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురాంరెడ్డి పేరు ఖరారుచేసింది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటును త‌మ అనుచ‌రుల‌కే ద‌క్కేలా జిల్లాలోని ముగ్గురు మంత్రులు పోటీ ప‌డ్డారు. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా లెక్క‌ల‌ను బేరీజు వేసుకొని అధిష్టానం చివ‌రికి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి పేరును అధిష్టానం  ఖరారు చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది. రామ స‌హాయం రఘురామి రెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి. గ‌తంలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేకాక‌..  సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా   వియ్యంకుడే. హీరో వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత‌ను ఆయ‌న పెద్ద కుమారుడు వినాయ‌క్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుమార్తె స్వ‌ప్నిరెడ్డిని ఆయ‌న చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. అయితే  ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ ఎస్‌ నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. మ‌రోసారి బీఆర్ ఎస్ అధిష్టానం ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. నామా నాగేశ్వ‌ర‌రావు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రాష్ట్రంలో ప‌దిహేడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం తొలుత ప్ర‌క‌టించిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి  అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో, ఖ‌మ్మం నుంచి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్  అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే  టికెట్‌ కేటాయించింది. రామ‌స‌హాయంకు టికెట్ కేటాయించ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్య‌క్తికే టికెట్ కేటాయిస్తూ వ‌స్తున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం అదే విధానాన్ని కొన‌సాగిస్తూ నామా నాగేశ్వ‌ర‌రావునే మ‌రోసారి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. ఖ‌మ్మంలో  తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వారు నామావైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో నామాకు గ‌ట్టిపోటీ ఇచ్చేలా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌రిలోకి దింపాల‌ని  కాంగ్రెస్ అధిష్టానం ఒక దశలో భావించింది.  అయితే స్థానికేతరుడు అన్న అభ్యంతరాలు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్య‌క్తి కావడంతో  అధిష్టానం మండ‌వ పేరును ప‌క్క‌న పెట్టింది. నామాను ఢీకొట్టేందుకు కమ్మ సామాజిక వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత లేక‌పోవ‌టంతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   వియ్యంకుడు అయిన రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రామ స‌హాయంకు విక్ట‌రీ వెంక‌టేశ్ కుటుంబంతో బంధుత్వం ఉండ‌టంతో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు బ‌ల‌మైన‌ సామాజిక  వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అధిష్ఠానం భావించినట్లు కనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.
Publish Date: Apr 25, 2024 10:14AM

దస్తగిరిని కాపాడు దేవుడా!

గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈనెల 22వ తేదీన ఆయన మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా లోకల్‌గా వున్న వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పులివెందులకు వచ్చే అవకాశం వుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇల్లు మరెక్కడో లేదు.. జగన్ ఇంటికి కూత వేటు దూరంలోనే వుంటుంది. గురువారం నాడు జగన్ నామినేషన్ సందర్భంగా దస్తగిరి ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో దాడి చేసి లేపేసే ప్రమాదం వుందనే అనుమానాలు వున్నాయి. అందుకే దస్తగిరికి బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. ప్రస్తుతం 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 భద్రత నుంచి 4 ప్లస్ 4, 10 ప్లస్ 10 స్థాయికి భద్రతను పెంచారు. ఇదిలా వుంటే వైసీపీ కారకర్తల బారి నుంచి దస్తగిరిని కాపాడు దేవుడా అని దస్తగిరి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా వుంటే, మరోవైపు దస్తగిరి కూడా ర్యాలీగా వెళ్ళి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేస్తానని, తనకు అధికారులు అడ్డుపడుతున్నారని దస్తగిరి అంటున్నారు. అధికారులు అడ్డుకున్నా తాను గురువారం నాడు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన అంటున్నారు. తాను నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేసే అవకాశం వుందని దస్తగిరి అనుమానిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 7:21PM

చావగొడుతున్న భార్య.. చెరువులోకి దిగిన భర్త!

ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన. భర్త భార్యని కొడితే వార్త కాదు.. భార్య భర్తని కొడితే వార్త. అలాంటి వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని కొంపల్లె ప్రాంతానికి చెందిన నగేష్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. (చాలామంది భార్యలు ఆమెని సంప్రదించి, భర్తని కొట్టడం ఎలా అనే పాఠాలు నేర్చుకునే ప్రమాదం వుంది కాబట్టి, సదరు భార్య పేరు గానీ, ఆమె వివరాలు గానీ ఇవ్వడం లేదు.. ఇది భర్తలకు మావంతుగా మేం అందిస్తున్న సహకారం). వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా వున్నారు. పిల్లలు పుట్టేవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాత ఏం తేడా వచ్చిందో ఏమో, సదరు నగేష్ భార్య భర్తని చావబాదడం ప్రారంభించింది. తనకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు భర్తకి బడితపూజ చేసేది. చేతికి ఏది దొరికితే దానితో చావబాదే పెళ్ళాం ధాటికి తట్టుకోలేక, ఇక జీవించి వృధా అని నగేష్ ఏం చేశాడంటే, తన ఇంటికి దగ్గర్లోనే వున్న చెరువులోకి దిగాడు. ఇది గమనించిన వారు, పెద్దగా అరిచి నగేష్‌ని ఆపారు. చెరువులో ఎందుకు దూకావని అడిగితే, నగేష్ తన కష్టాన్నీ చెప్పుకుని బాధపడ్డాడు.  తన భార్య తనను ప్రతిరోజూ టైమ్ టేబుల్ తప్పకుండా కొడుతుందని, అప్పుడప్పుడు వాతలు కూడా పెడుతుందని చెప్పుకొచ్చి భోరుమన్నాడు. తన మాటలు జనం నమ్ముతారో లేదోనని చొక్కా విప్పి మరీ తన ఒంటి మీద వున్న వాతలు చూపించాడు. తన పిల్లలని తన దగ్గరకి రానివ్వదని, తన పిల్లల కోసం ఐస్‌క్రీమ్ కొని తీసుకెళ్తే, తన భార్య దాన్ని పిల్లలకు పెట్టకుండా తానే తినేస్తుందని చెప్పి లబోదిబోమన్నాడు. భార్య టార్చర్ భరించలేక తాను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటానని చెప్పాడు. అలాంటి సందర్భాల్లో తన పిల్లలు డాడీ ఎక్కడకి వెళ్ళాడమ్మా అని తన పిల్లలు అడిగితే, తన భార్య చచ్చిపోయాడు అని కూల్‌గా చెబుతుందని చెప్పి నగేష్ బావురుమన్నాడు. తన భార్య నుంచి తనకు విడాకులు కావాలని వేడుకున్నాడు. విడాకులు ఇప్పించకపోతే చచ్చిపోతానని చెప్పాడు. దాంతో స్థానికులు అతనికి నచ్చజెప్పారు. తాడు వేసి అతన్ని  చెరువులోంచి పైకి లాగాడు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అని అతనికి చెప్పి ఇంటికి పంపించారు. నగేష్ ఇంటికి వెళ్ళాడు. మరి పరిస్థితులు చక్కబడతాయో... భార్య చేతిలో ఇంకో రౌండ్ కోటా పడుతుందో ఆ పైవాడికే తెలియాలి.
Publish Date: Apr 24, 2024 6:29PM

కేసీఆర్ బస్సు యాతన ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మహిళల హారతులు అందుకుని, కార్యకర్తల బాణాసంచా హడావిడి మధ్య కేసీఆర్ బస్సు ఎక్కారు. బుధవారం నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతుంది. మిర్యాలగూడలో మొదటి సభ, సిద్దిపేటలో చివరి సభ జరుగుతాయి. రాష్ట్రమంతా తిరగాలని కేసీఆర్‌కి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సమయం తక్కువగా వుండటం, ఎండ బాగా వుండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే తిరగాలని కేసీఆర్ భావించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ చేపట్టిన ఈ బస్సు యాత్రను.. బస్సు యాత్ర అనడం కంటే ‘బస్సు యాతన’ అనడం బెస్టు. ఎందుకంటే, పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ పదికి పైగానే స్థానాలు గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు బిల్డప్పుగా చెబుతున్నప్పటికీ, ఒక్క మెదక్ స్థానంలో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని ఏరకంగా చూసిన క్రిస్టల్  క్లియర్‌గా అర్థమవుతోంది. మెదక్ విషయంలో రేవంత్ రెడ్డి ఏదైనా మ్యాజిక్ చేస్తే  ఆ స్థానం కూడా బీఆర్ఎస్‌కి దక్కనట్టే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ వయసులో పదిహేను రోజులపాటు బస్సు యాత్ర చేసి యాతన పడటం అవసరమా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు చేపట్టిన బస్సు యాత్ర అయిపోయిన పెళ్ళికి సన్నాయి ఊదినట్టుగా వుందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 6:04PM

మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి. తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా. పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.
Publish Date: Apr 24, 2024 4:39PM

పెమ్మసాని ఆస్తులు, అర్హతలు చూసి కుళ్ళుకుని చస్తున్న వైసీపీ!

వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు.  చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే... మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు. టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది  డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 4:02PM

బీజేపీ స్ట్రాటజీ వ‌ర్క్ అవుట్ అవుతుందా? మోదీ గ్యారెంటీ ప్ర‌భావం ఎలా ఉంది?

మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు. గ‌తంలో ఈ సామాజిక వర్గం అండ‌తోనే బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుంది.  వాస్త‌వానికి బీజేపీ బలం అంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. మొత్తం 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉత్తరాదిలో రాష్ట్రాల్లోనే  ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎపుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతూ వ‌చ్చింది. అయితే  ఇప్పటికే రెండు ఎన్నికల్లో బీజేపీని గెల‌పించిన ఉత్తరాది ప్ర‌జ‌లు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన దాని కంటే సీట్లు తగ్గుతాయని బీజేపీ నేత‌లే అంటున్నారు.  2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న సీట్లు 260. అయితే ఈ సీట్ల‌లో ఈ సారి యాభై సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎందుకంటే మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 273 గా ఉంది. దానికి అరవై సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్ లో మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. అలాగే బీహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 గెలుచుకుంది. ఈసారి అలా కుదరదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుంజుకున్నాయి. దాంతో పది సీట్లు నష్టపోతుందనే అంచ‌నా. అదే విధంగా చూస్తే కనుక గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లనూ స్వీప్ చేసింది బీజేపీ. ఈసారి కనీసంగా రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ నష్టపోతుంద‌ట‌. అలాగే హర్యానాలో నాలుగు సీట్లు బీజేపీ ఓడిపోతుందట‌. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఏడింటికి ఏడూ 2019లో బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. అంటే రెండు ఎంపీ సీట్లు నష్టపోక తప్పదు. కర్నాటకలో 28 ఎంపీ సీట్లలో పాతిక దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి పది ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉన్నాయి. కర్నాటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలు ద‌క్క‌వు. ఉత్తర భారతాన బీజేపీ యాభైకి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే కనుక అక్కడ చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న రాజ్ పుట్ లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ఒకనాడు రాజ్ పుట్ లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు. రాముడు రాముడే.. రాజకీయం రాజకీయమే... ఓటు ఓటే... అంటున్న 3 కోట్ల మంది రాజపుత్రులు బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తం అవుతుంది.  మొదటి దశ ఎన్నికల అనంతరం నిర్వహించిన లోక్ పోల్ సర్వేలో ఉత్తర భారతం నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ ఆధిక్యం ఏమీ లేదని తేలింది. బీజేపీ హయాంలో ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడిన తీరు, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత కిరోడిలాల్ మీనా  సామాజికవర్గం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతోందని అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.   అలాగే బీజేపీ ప్రభుత్వం, రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడిని లాగి, తలపాగా విసిరి, పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు, అప్పటి నుంచి రాజ్‌పుత్ సమాజం మొత్తం బీజేపీకి ఓటు వేయబోమని ప్రమాణం చేసింది.  దీని వల్ల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో బీజేపీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు అన్ని స్థానాల్లో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నప్పటికీ, త్యాగి మరియు సైనీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బిజెపి టికెట్లు ఇచ్చి నిలబెట్టలేదు. దీంతో అస‌హ‌నంతో వున్న ఆ రెండు వర్గాల వారు  బిజెపికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో వివిధ చోట్ల పంచాయితీలు చేస్తున్నారు. అంతే కాదు  గుర్జర్ సామాజికవర్గ ప్రతినిధులను టిక్కెట్ ఇవ్వ‌కుండా దూరంగా ఉంచింది, దీంతో చాలా మంది గుర్జర్ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పారు. వరుసగా 10 సంవత్సరాలుగా గుర్జర్ సామాజికవర్గ ప్రజలకు తగిన వాటా లభించలేదు.  దీని ప్రభావం రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది. ఈసారి కాశ్మీర్‌లో కూడా అనేక ప్రజా సంఘాలు మరియు కాశ్మీరీ పండిట్ల సంస్థలు బిజెపిపై తమ ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది జమ్మూ,  కాశ్మీర్‌లో బిజెపికి ఓట్లను తగ్గిస్తుంది. గ‌త రెండు ఎన్నిక‌ల‌తో పోల్చితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వస్తోందని తాజా సర్వేలో తేలింది.  ఈ కారణంగానే బీజేపీ ఓటర్లు ఫ‌స్ట్ ఫేజ్‌లో ఓటు వేసేందుకు బయటకు రాలేదు.  తదుపరి దశ పోలింగ్‌లో బీజేపీ మద్దతుదారుల ఆగ్రహం తగ్గుతుందా? ఇదే బీజేపీ అధిష్టానానికి వేధిస్తున్న ప్ర‌శ్న‌.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌  
Publish Date: Apr 24, 2024 3:58PM

జగన్ వ్యూహ వైఫల్యం.. ఆ రెండు స్థానాల్లో వైసీపీ ఓటమి ఖాయం!

గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.  ఇవన్నీ ఒకెత్తయితే.. వ్యూహాత్మకంగా ఆయన సిట్టింగులను మార్చిన తీరు ఇప్పుడు  పలు నియోజక వర్గాలలో  వైసీపీని విజయానికి దూరం చేయడం ఖాయంగా మారింది. అలాంటి నియోజకవర్గాలలో ఇప్పుడు మాడుగుల అసెంబ్లీ, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గాలు చేరాయి. పోలింగ్ కు ముందే ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ఓటమి ఖరారైపోయిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతూ చేతులెత్తేశాయి.  ముందుగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటైన అభ్యర్థి అని భావించి సీఎం జగన్  మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. నియోజకవర్గం మార్పునకు బూడి ముత్యాల నాయుడిని ఒప్పించడంలో భాగంగా మాడుగుల టికెట్ ను ఆయన కుమార్తె అనూరాథకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.  ఫలితం ఇప్పడు ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీ ఓటమి ఖాయమని ఆయన పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మాడుగుల నుంచి బూడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపడానికి జగన్ సామాజిక సమీకరణాలను ఆధారంగా తీసుకున్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగిన సీఎం రమేష్ కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. అనకాపల్లి లోక్ సభ పురిధిలో ఆ సామాజిక వర్గ ఓటర్లు నాలుగు లక్షల పై చిలుకు ఉన్నారు. దీంతో జగన్ అదే సమాజికవర్గానికి చెందిన బూడిని ఇక్కడ నుంచి బరిలోకి దింపారు.  బూడి స్థానికత ప్లస్ అవుతుందనీ, విజయానికి దోహదపడుతుందనీ జగన్ భావించారు. అయితే అనకాపల్లిలో కాపు సామాజిక ఓటర్లు  కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజికవర్గ ఓటర్లు 5 లక్షల పై చిలుకు ఉన్నారు. జనసేన కూటమి భాగస్వామ్య పార్టీయే కావడం సీఎం రమేష్ కు కలిసి వచ్చింది. అంతే కాకుండా సీఎం రమేష్ కు మెగా స్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత కారణంగా కొప్పుల వెలమ సామాజిక వర్గంలో  మెజారిటీ సీఎం రమేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  జగన్ ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పుడిక మాడుగుల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు రెండు సార్లు విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంపై గట్టి పట్టు కూడా ఉంది. అయితే  జగన్ బూడిని మార్చి ఆయన కుమార్తె అనూరాథను ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నిర్ణయం బూడి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. తన తండ్రి స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ బూడి కుమారుడు రవి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు. పోటీ నుంచి వైదొలగడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిణామం ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యనారాయణ మూర్తికి ఆయాచిత లబ్ధిగా మారింది. పెందుర్తి సీటు ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి  ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో చివరి నిముషంలో మాడుగుల బరిలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తికి లాభం చేకూరుతుంది. పెందుర్తి సీటును జనసేనకు ఇవ్వడంతో బండారు చొవరి నిముషంలో మాడుగులకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ బండారుకు వైసీపీయే విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లైంది.  జగన్ వ్యూహ వైఫల్యం అనకాపల్లి లోక్ సభ, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పరాజయాన్ని ఖరారు చేసినట్లైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  
Publish Date: Apr 24, 2024 3:46PM

ఇసుకేస్తే రాలనంత జనం.. నామినేషన్ రోజే ఖరారైన యార్లగడ్డ విజయం!

ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.  గన్నవరం.. తెలుగుదేశం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నారు. అయితే  ఆయన 2019లో పార్టీ పరాజయం తరువాత తెలుగుదేశం వీడి వైసీపీ గూటికి చేరారు. అప్పటికి కానీ ఆయనకు అర్ధం కాలేదు. వరుసగా తన రెండు విజయాలు తెలుగుదేశం బలం కానీ తన బలం కాదని. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ప్రచారం హోరెత్తుతున్న వేళ.. తాను ఎంత నిస్సహాయంగా మిగిలాడో వంశీకి తెలిసివచ్చినట్లైంది.  ఈ సారి గన్నవరంలో పోటీ పడుతున్నది పాత ప్రత్యర్థులే. అయితే పార్టీలు  మారాయి. గత ఎన్నికలలో  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే యార్లగడ్డకు తెలుగుదేశం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండగా, వంశీ మాత్రం వైసీపీలో తన వ్యతిరేక గ్రూపుల సహాయనిరాకరణతో  డీలా పడ్డారు. ఇక ఇప్పుడు నామినేషన్ల ఘట్టం దగ్గరకు వచ్చేసరికి యార్లగడ్డ వెంకట్రావు బుధవారం (ఏప్రిల్ 24)న  తన  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భారీ జనసందోహం చూస్తే గన్నవరంలో  యార్లగడ్డ విజయం ఖారారైపోయిందనిపించక మానదు.  రాజకీయ సన్యాసం గురించి గతంలోనే ఆలోచించిన వంశీ ఆ ఆలోచన ఎందుకు విరమించుకున్నానా అని మథనపడుతూ ఉంటారని తెలుగుదేశం శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.  యార్లగడ్డ నామినేషన్ సందర్భంగా కూటమి ఐక్యత ఎంత పటిష్టంగా ఉందో మరో సారి రుజువైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో  రాలీలో పాల్గొన్నారు. మరో వైపు ఇప్పటికే  వంశీకి సహకారం అందించే ప్రశక్తే లేదని పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టేశాయి. దీంతో వంశీ నామినేషన్ ర్యాలీ వెలవెలపోవడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఊహించే యార్లగడ్డతో   పాటే గురువారం ( ఏప్రిల్ 25)న నామినేషన్ దాఖలు చేయాలని, తద్వారా పోటీపోటీ ర్యాలీల పేరుతో గందరగోళం సృష్టించాలన్న వంశీ వ్యూహం బెడిసికొట్టింది. ఒకే రోజు ఇద్దరికీ నామినేషన్ దాఖలుకు రిటర్నింగ్ అధికారి  అనుమతి ఇవ్వలేదు. దీంతో యార్లగడ్డ ఒక రోజు ముందే నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.  దీంతో గురువారం (ఏప్రిల్ 25) వంశీ నామినేషన్ సందర్భంగా ర్యాలీ తీసే సాహసం చేయకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: Apr 24, 2024 3:19PM

బీఆర్ఎస్ లో కేసీఆర్ వర్సెస్ కేటీఆర్?

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా?   ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) రెండో సారి గెలిచిన తరువాత నుంచే తండ్రీ కొడుకుల మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడమన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్ కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు వీటిలో కారణమేదైతేనేం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కు పట్టాభిషేకం అయితే జరగలేదు. ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది.  అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు.  అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు.  ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే... కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.   
Publish Date: Apr 24, 2024 2:02PM

మసాలా పౌడర్లలో ఇథిలీన్ ఆక్సైడ్... క్యాన్సర్ ప‌క్కా అంటున్న న్యూట్రీష‌న్లు

భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.  నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను సేక‌రిస్తున్న‌ట్లు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది.  ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఈ కంపెనీల‌ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే....ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' సీఎఫ్ఎస్ చెప్పింది.  ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే హాంకాంగ్ చ‌ట్టాల ప్ర‌కారం గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గ‌తంలోనూ అదే....2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది. వాళ్ళు చెప్పిందేమిటంటే ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారట‌. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి.  అలాగే నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు.   “ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది.  అయితే  సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, బెల్జియన్ ల్యాబ్ నివేదికల‌కు, మ‌న‌ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెస్ట్‌ల‌కు తేడా ఎందుకు వ‌చ్చింది? ఇదే చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇండియాలో చేసే నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త క‌నిపించి, విదేశాల్లో జ‌రిపిన నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని దేశ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  దేశంలోని అన్ని తయారీ యూనిట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించాలని ఫుడ్ కమిషనర్‌లను ఆదేశించింది. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ఇప్ప‌ట్టికే ప్రారంభమైంది.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామ‌ని కేంద్ర‌ ప్రభుత్వ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.  భారతదేశంలోనూ ఆహార పదార్థాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకంపై నిషేధం ఉంది.  ఒక వేళ మసాలా దినుసుల్లో హానికరమైన పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తాము ఉత్ప‌త్తి చేసే ఉత్పత్తులకు, హానికరమైన అంశాలు జోడించరాదని అవగాహన కల్పించాలని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల బోర్డుకు భార‌త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  భారతీయ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సుగంధ ద్రవ్యాలు-మిక్స్ ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ విధించిన నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు  స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఆరోగ్యంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని  ఎబి రెమ శ్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇథిలీన్ ఆక్సైడ్‌ను 'గ్రూప్ 1 కార్సినోజెన్'గా వర్గీకరించిందని ఆమె చెప్పారు. అంటే "ఇది మానవులలో క్యాన్సర్‌కు కారణమవుతుంది.  మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులు చికాకు కలిగించ‌డంతో పాటు మెదడు,  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై చర్యలను ఖరారు చేయనున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 24, 2024 12:58PM

‘గులకరాయి’పై ఏపీ యూత్ వెటకారాలు!

పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ సానుభూతి డ్రామా వికటించి వెటకారాలకీ, ట్రోలింగ్‌కి దారితీసింది. గులకరాయి డ్రామాని ‘కంటి’న్యూ చేస్తూ జగన్ కంటిమీద ఒక ప్లాస్టర్‌తో తిరుగుతున్నారు. నేను మాత్రం యాక్టింగ్‌తో తక్కువా అన్నట్టు వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి పెద్ద కట్టు కట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళ కట్లు, వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఈ కట్లను ఏపీ యూత్ చాలా కామెడీగా తీసుకుని వెటకారాలు చేస్తున్నారు. కొంతమంది జగన్, వెల్లంపల్లి తరహాలో బ్యాండేజీలు కట్టుకుని కనిపిస్తున్నారు. ఇదేంట్రా బాబూ అంటే, కొత్త ఫ్యాషన్ అని వెటకారంగా అంటున్నారు. మొత్తానికి జగన్ అండ్ కో ఏదో చేయాలనుకుంటే ఇంకేదో జరిగింది.
Publish Date: Apr 24, 2024 12:33PM