కొత్త పెళ్ళికూతురు జంప్ జిలానీ!

 

 

 

అమ్మాయిలని పెళ్ళి చేసుకుని, కొంతకాలం ఎంజాయ్ చేసి అబ్బాయిలు జంప్ జిలానీలు అయిపోవడం కామన్‌గా జరుగుతూ వుంటుంది. అప్పడప్పుడు అమ్మాయిలు కూడా ఇలా అబ్బాయిలకి జలక్ ఇస్తూ వుంటారు. అదే వెరైటీ అవుతుంది. ఇలాంటి సంఘటన లేటెస్ట్ గా తమిళనాడులో జరిగింది. అనాథగా నటించి ఒక బకరా కుర్రాడిని పెళ్ళి చేసుకున్న ఓ జాదూ లేడీ పెళ్ళయిన నెల తర్వాత ఇంట్లో నగలు, డబ్బు అంతా మూటగట్టుకుని ఎంజక్కా జంపైపోయింది. సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతంలో జరిగింది. కవి అనే యువతి తనను తాను అనాథగా చెప్పుకుని ఒక మహిళతో పరిచయం పెంచుకుంది. ఆ మహిళ కవికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. కవి బోలెడంత మంచితనం యాక్ట్ చేసేసరికి ఆమెకి ఆశ్రయం ఇచ్చిన మహిళ ఫ్లాటైపోయింది. తన దగ్గరి బంధువైన ఒక యువకుడికి కవిని ఇచ్చి పెళ్ళి చేసింది. ఒక అనాథ యువతికి జీవితం ఇచ్చానని ఆమె చాలా హ్యాపీగా ఫీలైపోయింది. కవిని పెళ్ళి చేసుకున్న యువకుడు కూడా తాను రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తల కోవలోకి వస్తానని గర్వంగా ఫీలయ్యాడు. ఒక నెలపాటు ఉత్తమ ఇల్లాలిలా కటింగ్ ఇచ్చిన కవి ఓ ఫైన్ నైట్ ఇంట్లో వున్న బంగారం, డబ్బు మొత్తాన్నీ ఊడ్చుకుని జంప్ అయిపోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఎంక్వయిరీ చేసి అసలు విషయం తెలుసుకున్న అందరూ నోళ్ళు తెరిచారు. కవి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంక ఆమె ఎక్కడ దొరుకుతుంది? ఈపాటికి ఎక్కడో మరో బకరాని వెతుక్కునే పనిలో వుండి వుంటుంది.