తిరుపతి కోసం గ్రేటర్ ఫిక్సింగ్? పవన్ పై రోజా పంచ్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ కోసం జనసేన తప్పుకుందని చెప్పారు. తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా?.. గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని పవన్ ను టార్గెట్ చేస్తూ రోజా ప్రశ్నించారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు.. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారని రోజా అన్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు. 

 

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జనసేన పార్టీయా లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు  ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని రోజా విమర్శించారు.