ఖబడ్దార్ చంద్రబాబూ...వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్ !

 

ఏపీ అసెంబ్లీ ఈరోజు వాడీ వేడిగా జరిగింది, ఈరోజు జరిగిన చర్చల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయగా టీడీపీ సభ్యులు అందరూ వాకౌట్ చేశారు. అయితే అంతకు ముందు చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ చేశారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సభలో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా కావాలనే ప్రతిపక్షం గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు అధ్యక్షా మైకు అంటూ అడుక్కోవాల్సో వచ్చేదని అన్నారు. 

అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ‘ఖబడ్దార్.. ఖబడ్దార్ చంద్రబాబూ.. నీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ శ్రీధర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నామని వాటిని సద్వినియోగపరచకుండా రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. గతంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను ఉద్దేశించి మగాడివా మగతనం ఉందా అంటూ అవమానించేలా మాట్లాడితే చప్పట్లు కొట్టిన పెద్ద మనిషి చంద్రబాబని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.వీడ్కోలు సభలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ జగన్ అద్భుత ముఖ్యమంత్రి అని కితాబిచ్చారని, జగన్‌కు దక్కతున్న ప్రశంసలు చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.