అక్రమాస్తుల కేసులో జగన్ కు షాక్....

 

వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జ‌గ‌న్‌ బెయిల్ ను రద్దు చేయాల‌ని గగన్ విహార్ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ పిటషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను ఆదేశించింది. విచార‌ణ వ‌చ్చేనెల 7కి వాయిదా వేసింది.