మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా: జగన్
posted on May 23, 2019 6:13PM
ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం కావడంతో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు. తమని గెలిపించిన ప్రజలకు కృతఙ్ఞతలు చెప్పడంతో పాటు.. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు:
- అద్భుత విజయం అందించిన ప్రజలకి కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం.
- ఈ విజయం దేవుడి దయ, ప్రజల దీవేనలతో సాధ్యమైనది.
- ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది.
- ప్రజలు ఓటు వేశారు అంటే విశ్వసనీయతకు ఓటు వేశారు
- ఈ విజయం తో నా మీద బాధ్యత మరింత పెరిగింది.
- 5 కోట్ల మందిలో దేవుడు ఒకరికే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినందుకు సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తా. ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా.
- సుపరిపాలనకు తొలి అడుగు నవరత్నాలు.
- తొలి సంతకం కాదు, నవరత్నాలు అన్నీ అమలు చేస్తాను.
- ఈ నెల ౩౦న విజయవాడ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను.