జగన్ పాదయాత్రలో అపశృతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద బహిరంగసభ ఏర్పాటు చేశారు. ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడుతుండగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ నాయకులకు.. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి కార్యకర్తలు వీరిని ఆసుపత్రికి తరలించారు. జగన్ వస్తోన్న సమయంలో పెద్ద ఎత్తున జనం స్టేజ్ పైకి ఎక్కడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ్టీకి 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చెర్లోపల్లి వద్ద జగన్ ఓ రావి మొక్కను నాటారు వైసీపీ అధినేత.