సీబీఐ కోర్టు వద్ద జగన్ భార్య ఓవరాక్షన్
posted on Jun 7, 2013 4:13PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భార్య భారతి నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. కోర్టు వద్దకు ర్యాలీగా వస్తున్న భారతితో సహ ఆమె అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆగ్రహించిన భారతి ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు షాక్కు గురయ్యారు. కాగా కోర్టులో జగన్ అనుచరులు తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. లాయర్లను జగన్ అనుచరులు తోసివేయడంపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆరునెలల తరువాత జైలుగోడలు దాటి కోర్టుకు హాజరయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో హుషారుగా నవ్వుతూ కనిపించారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటిసారి కోర్టుకు హాజరయి ఎంతో ముభావంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను నవ్వుతూ జగన్ పలకరించారు. ఆరు నెలల తరువాత జైలునుండి కోర్టుకు వచ్చిన కొడుకును చూసిన విజయమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంటే జగన్ ఆమెను ఓదార్చారు. జగన్ అలింగనం చేసుకుని ఆవేదన చెందింది విజయమ్మ.