బాలయ్య అంటే జగన్ కి ఇంత అభిమానమా.. చూస్తే మతిపోతుంది!!

 

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అభిమానమన్న సంగతి తెలిసిందే. జగన్ కాలేజీ రోజుల్లో.. బాలకృష్ణ సినిమా విడుదల అయిందంటే చాలు.. తెగ సందడి చేసేవారని చెబుతుంటారు. ఆ అభిమానంతోనే ప్రత్యర్థి పార్టీలో ఉన్నా కూడా బాలకృష్ణపై జగన్ విమర్శలు చేయరు. ఎన్నికల ప్రచారాంలో కూడా జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్‌ను విమర్శించినా.. ఎక్కడా బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడ లేదు. దీన్నిబట్టే జగన్ కు బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో చెప్పొచ్చు.

అయితే బాలకృష్ణ అంటే జగన్ కి ఎంత ఇష్టమనే విషయం తాజాగా మరోసారి రుజువైంది. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ‘సమర సింహా రెడ్డి’ సినిమా కడపలో దాదాపు  ఏడాదికి పైగా నడించింది. ఈ సందర్భంగా 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన పేపర్ ప్రకటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో ‘సమర సింహా రెడ్డి’ తెలుగులో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులును తిరగరాసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. అభిమాన హీరో సినిమా ఘన విజయం సాధించడంతో.. ఆ ఆనందంలో జగన్ పేపర్ ప్రకటన ఇచ్చారు.