వైసీపీకి షాక్..టీడీపీలోకి పులివెందుల బ్రదర్స్..


పులివెందులలో వైసీపీకి షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి సోదరులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు బీటెక్ రవి, సతీష్ రెడ్డి తదితర నేతలు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వైయస్ కుటుంబానికి వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైసీపీ విధానాలు, నిర్ణయాలు నచ్చకే రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలపడుతోందని.. పార్టీలోకి ఎవరు వచ్చినా, ఆహ్వానిస్తామని అన్నారు.