జగన్ ని ఇరకాటంలో పెట్టిన యనమల ప్రశ్న..!!

ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు జత చేసిన విషయం తెలిసిందే.. దీని గురించి మీడియాలో కూడా వార్తలు జోరుగా వచ్చాయి.. అయితే ఈ విషయాన్ని జగన్ ఖండించారు.. 'నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను.. ఇది చాలా బాధాకరం.. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది' అన్నారు.. అలాగే దీని వెనుక టీడీపీ హస్తముందని ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలకు మంత్రి యనమల రామకృష్ణుడు, ఓ ప్రశ్నతో సమాధానం ఇచ్చారు.. జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.

 

 

తాజాగా యనమల మాట్లాడుతూ.. ఈడీ కేసు విషయంలో జగన్ వాదన విచిత్రంగా ఉందని అన్నారు.. కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్, వార్తలపై మాత్రం అభ్యంతరం ఎలా చెబుతారని మండిపడ్డారు.. జగన్ వైఖరితోనే ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని, ఛార్జీషీటులో భారతి పేరు ఉండటాన్ని జగన్ ఎక్కడా ఖండించలేదని అన్నారు.. మీడియా లేనిది ఉన్నట్లుగా రాస్తే తప్పుపట్టాలి కానీ, ఉన్నది రాస్తే ఎందుకని ప్రశ్నించారు.. అలాగే ఈడీ ఛార్జీ సీటు కేసులో టీడీపీకి సంబంధం ఏముంటుందని ప్రశ్నించిన యనమల, ఈడీలోని ఇద్దరు అధికారులు సహాయం చేశారనడం సరికాదన్నారు.