టీమిండియాకు షాక్

మరి కొద్ది సేపట్లో ప్రారంభంకానున్న మహిళా ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయపడ్డారు. నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె భుజానికి గాయమైంది. దీంతో హర్మన్ నెట్స్ నుంచి నిష్క్రమించారు. ఈ వార్త అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. సెమీస్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్మన్ ప్రీత్ భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. దీంతో ఫైనల్లో ఆమె ఆడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలను కెప్టెన్ మిథాలీ రాజ్ ఖండించారు. నెట్స్ నుంచి వెళ్లిన హర్మన్ భుజానికి ఐస్ ప్యాక్ పెట్టుకొని ఉపశమనం పొందారని..తుది పోరుకు ఆమె ఫిట్‌గా ఉంటారని చెప్పారు.