ఉద్రిక్తంగా మారిన పెన్షన్ పంపిణీ...

విజ‌య‌న‌గ‌రంలో పెన్ష‌న్ పంపిణీ లో వాలంటీర్‌లు చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. ఇదేమిట‌ని అడిగితే చావుదెబ్బ‌లు త‌ప్ప‌టం లేదంటున్నారు వృద్ధులు. వేలు ముద్రలు వేయించుకొని డ‌బ్బులివ్వ‌లేద‌ని ఓ వృద్ధురాలు ఆరోపించింది.

విజయనగరం జిల్లా జామి మండలం పావాడలో పెంక్షన్ పంపిణీలో అవకతవకలు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వేలుముద్రలు వేయించుకొని డబ్బులివ్వలేదని వృద్ధురాలు ఆరోపించి అడిగినందుకు వృద్దులపై  వాలంటీర్ దౌర్జన్యం చేయ‌డంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఈ సంద‌ర్భంగా కొట్లాట జ‌రిగింది. పెన్ష‌న్ కోసం మహిళలు  వాలెంటీర్ల మ‌ధ్య గొడ‌వ రోడ్డు కెక్కింది.