విజయవాడ మాజీ ఎంపీ మృతి

 

విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య(84) ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.. విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు.. చెన్నుపాటి విద్య, ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె.. విద్య మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.. ఆమె మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఆమె సేవలు ప్రశంసనీయమని, మహిళాభ్యుదయం కోసం విద్య ఎనలేని కృషి చేశారని అన్నారు.. చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు అన్నారు.