ప్రజలకు జవాబుదారులం.. పచ్చ దొంగలకు కాదు: ఉమా పై విజయ్ సాయి ఫైర్

 

టీడీపీ, వైసిపి నేతల మధ్య నిత్యం  ఎదో ఒక విషయం పై ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం లేదా విమర్శించుకోవడం కామన్ విషయం గా మారిపోయింది. తాజాగా జగన్ ప్రభుత్వం తెస్తున్న రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్, పోలవరం కాంట్రాక్టు రద్దు వంటి నిర్ణయాలపై టీడీపీ నేత ఉమా చేసిన విమర్శలను విజయసాయి తిప్పికొట్టారు. దేవినేని ఉమా కొద్దిరోజులు ఓపిక పడితే, రివర్స్ టెండర్లు, జ్యుడీషియల్ కమిషన్ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందని, అలాగే టీడీపీ హయాం లో  జరిగిన వేళా కోట్ల దోపిడీ కూడా బయట పడుతుందని అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీలోని అన్ని ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తీ చేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారని ఆ ట్వీట్ లో తెలిపారు. మేం ప్రజలకు జవాబుదారులం కానీ పచ్చ దొంగలకు కాదు అని ఆయన తన ట్వీట్ లో తీవ్రంగా విమర్శించారు.