హైదరాబాద్‌లో వెంకయ్యకు ఘనస్వాగతం

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న ఉప రాష్టపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో వెంకయ్యను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి 600 మందికి ఆహ్వానం పంపారు. ఉప రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లో కట్టుదిట్టుమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.