వంగవీటి మోహన రంగా విగ్రహం ధ్వంసం... రాధా గట్టి వార్నింగ్

 

విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విజయవాడలోని సింగ్ నగర్ లో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో విషయం తెలుసుకున్న వంగవీటి రాధా వర్గీయులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా తీవ్ర హెచ్చరికలు చేశారు. . ప్రజల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నేతల సహకారంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టారని.. విగ్రహాన్ని పడగొట్టిన వారు రంగా అభిమానులకు చిక్కితే పరిస్థితి దారుణంగా ఉంటుందని, అది వారి ఖర్మని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి ఇదే స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ధైర్యముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఈ పనికి పాల్పడ్డవారిని ఊరికే వదలబోమని అన్నారు.