ప్రజాకవి వంగపండు కన్నుమూత

ప్ర‌ముఖ జానపద కళాకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77) మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన.. విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం పెద‌బొంద‌ప‌ల్లిలోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు.

1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను, గిరిజ‌నుల‌ను చైత‌న్య ప‌రిచారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయన  2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు.