ముఖ్యమంత్రిని కలవనున్న వల్లభనేని వంశీ

 

తెదేపా నేత వల్లభనేని వంశీ ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఐజీ సీతారామాంజనేయులపై పిర్యాదు చేయబోతున్నారు. గతంలో కమీషనర్ ఆఫ్ పోలీసుగా చేసి పదోన్నతి పొంది ఐజీగా ఉన్న సీతారామాంజనేయులుతో వంశీకి చాలా కాలంగా విభేదాలున్నాయి. ఇప్పుడు తాజాగా అవి మరో మారు బయటపడ్డాయి. సీతారామాంజనేయులు తనను మాజీ నక్సల్స్ తో హత్య చేయించాలని చూస్తున్నారని, అందువల్ల తనకు ఐజీ సీతారామాంజనేయుల నుండి ప్రాణహాని ఉన్నందున తగిన భద్రత కల్పించాలని కోరుతూ వంశీ డీజీపీకి లికితపూర్వకంగా నిన్న పిర్యాదు చేసారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఈయనున్నారు.