బీజేపీలోకి వల్లభనేని వంశీ....క్లారిటీ వచ్చేసింది !

ఏపీ రాజకీయాలు అంతా ప్రజావేదిక చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా ధనం అని చూడకుండా అక్రమ నిర్మాణం పేరుతో జగన్ దానిని కూలగొట్టించారు. ఈ నేపధ్యంలో అది తప్పని టీడీపీ వారు, మేధావులు పేర్కొంటుంటే లేదు ఉన్న మిగతా కట్టడాలను కూడా కూల్చివేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే నిన్నటి దాకా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నిన్న రాత్రి పొద్దుపోయాక విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే టీడీపీ నేతలు అందరూ తన ఇంటిలో జరిగే సమావేశాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో దాదాపు చాలా మంది నాయకులు ఆయన సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ముఖ్యంగా మొన్న కాకినాడలో మీటింగ్ పెట్టిన కాపు నేతలు అందరూ డుమ్మా కొట్టగా, కృష్ణా జిల్లాలో గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరయిన వంశీ కూడా డుమ్మా కొట్టడం చర్చలకు దారి తీస్తోంది. ఆయన కూడా పార్టీ వీడి కాషాయం కండువా కప్పుకోనున్నాడని, స్వయంగా సుజనా చౌదరి రంగంలోకి దిగి చేరికలను పర్యవేక్షిస్తున్నారని ప్రచారం మొదలయ్యింది. అయితే ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ ఈ విషయం గట్టిగా ట్రెండ్ అయ్యింది. ఈయనకి సినిమా ఇండస్ట్రీతో సంబందాలు ఉండడం. ఈయన స్వయానా నిర్మాత కావడమే కాక జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితుడు కావడంతో ఈ వార్త కాస్త గట్టిగానే ప్రచారం అయ్యింది. దీంతో ఆయన స్పందించక తప్పలేదు. ఆయన తాజాగా మాట్లాడుతూ  తనతో సుజనా చౌదరి మాట్లాడలేదని, బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం నిజం కాదని అన్నారు.