ఎన్నికలముందు కాంగ్రెస్ కు షాక్...

 

ఉత్తరాఖండ్ లో  అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి యశ్‌పాల్‌ ఆర్య బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఉత్తరాఖండ్ లో  ఒకే విడతలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.