ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న నాలుగోవిడత పోలింగ్

ఉత్తరప్రదేశ్‌లో నాలుగోవిడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌‌లో 12 జిల్లాల్లోని ఇవాళ 53 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1.85 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలిలో కూడా ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 50%  పోలింగ్ నమోదైంది. కాగా ఫతేపూర్ జిల్లాలోని ఖాగా ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ప్రభుత్వం తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనందున ఓటు వేయమంటూ నిరసన వ్యక్తం చేశారు.