ఆసుపత్రిలో..రోగుల మధ్య డీజే డ్యాన్సులు..

ఒక పక్క రోగులు ఆసుపత్రిలో దేవుడా..రాముడా అంటుంటే వాళ్లను పట్టించుకోవాల్సింది పోయి వైద్యులు, సిబ్బంది డీజే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాంపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో పనిచేసే ఓ వార్డు బాయ్ కుమారుడి పుట్టినరోజును వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అంతే ఓ పెద్ద కేక్ తెప్పించి కట్ చేయించారు. ఆ వెంటనే డీజే ఏర్పాటు చేయడంతో వైద్యులు, సిబ్బంది ఆటపాటలతో ఎంజాయ్ చేశారు..భారీ శబ్ధాలు రావడంతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఉలిక్కిపడి లేచారు. అయితే రోగుల్లో ఎవరో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.