యూపీలో బాంబు పేలుడు... మూడు బాంబులు లభ్యం..

 

ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్‌ ప్రాంతంలో రాజు తప్పా అనే వ్యక్తి  రైల్వే పట్టాల సమీపంలో చెత్త సేకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో మరో మూడు బాంబులు లభ్యమయ్యాయి. రాజు సేకరించిన చెత్తలోని ఓ బ్యాగులో మూడు బాంబులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.