చంద్రబాబులో ఉన్న నైపుణ్యం జగన్ లో లేదు

ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి అంచనా వేసి వివరిస్తూ ఉంటారు.. తాజాగా ఉండవల్లి ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి వివరించారు.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉంది.. అలా అని చంద్రబాబుని తక్కువ వేయలేం.. బాబులా ఎన్నికలు మేనేజ్ చేసే నైపుణ్యం జగన్ కి లేదని అన్నారు.. అలానే వైసీపీకి ప్రజలు ఉన్నారు కానీ ఓట్లుగా మలుచుకునే నెట్ వర్క్ వైసీపీకి లేదన్నారు.. ఇక జనసేనని అప్పుడే అంచనా వేయలేమని, ఇంకా ఆ పార్టీ నిర్మాణ దశలోనే ఉందని ఉండవల్లి అన్నారు.