ఊచలు లెక్కపెడతావ్ ఉమా.. కాదు నువ్వే బెయిల్ మీదున్నావు సాయి రెడ్డి

నిత్యం చంద్రబాబు, లోకేష్ ల పై స్ట్రాంగ్ కామెంట్లతో విరుచుకుపడే వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పై రెచ్చిపోయారు. తాజాగా టీడీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు.

"వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందంటున్నారు. దీంతో ఉమకి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడేది తెలియడంలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణాలు బయటికి వస్తే నువ్వు కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందే ఉమా.. మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు, పంచుకోవడాలు అన్నీ మీతోనే పోయాయి" అంటూ వ్యాఖ్యానించారు.

దీని పై మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "తమ ప్రభుత్వ హయాంలో ఏపీ నీటిపారుదల రంగాన్ని దేశంలోనే 2వ స్థానంలో నిలిపామని ఆయన స్పష్టం చేసారు. అంతే కాకుండా "కారు దింపిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడినట్టున్నావు. 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలల ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకు భయపడం. జైలు నుంచి బెయిల్ పై వచ్చావ్.. ఒళ్ళు సోయిలో పెట్టుకో, బెదిరింపులు ఆపు జరబద్రం" అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డిని ఉమ హెచ్చరించారు.