స్విమ్స్ లో ఎడ్మిట్ అయిన తిరుపతి వేద పాఠశాల విద్యార్థులు సేఫ్

వేద పాఠశాలకు చెందిన 5 మంది విద్యార్థులు తో పాటు ఇద్దరు టీచర్స్ కి ముందు జాగ్రత్తగా చేసిన కరోనా టెస్ట్ లో నెగటివ్ రిపోర్ట్ కావడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దగ్గు, జలుబు తో బాధపడుతోన్న విద్యార్థికి అత్యంత సాధారణ అనారోగ్యమని స్విమ్స్ వైద్యులు నిర్ధారించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి, అవాంఛనీయ సంఘటనకు తావివ్వకూడదనే ముందస్తు పరీక్షలు నిర్వహించినట్టు టీటీడీ ఉన్నతాధికారులు గుర్తించారు.