లీడ్ లో టీఆర్ఎస్.. కాంగ్రెస్ సీనియర్లు వెనుకంజ

 

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఓట్ల లెక్కింపు మొదలైంది. మరి కొద్ది గంటల్లో ఈ ఎన్నికల పోరులో ఎవరు గెలవబోతున్నారో తెలియనుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ 75, ప్రజకూటమి 21, బీజేపీ 2, ఎంఐఎం 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. అయితే తరువాత ఈ లీడ్ తారుమారు అవుతుందో లేక అలాగే కొనసాగుతుందో చూడాలి. అయితే అనూహ్యంగా కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు వెనుకంజలో ఉన్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, పరకాలలో కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు వెనుకంజలో ఉన్నారు. మరి వీరు తరువాత రౌండ్స్ లో పుంజుకొని లీడ్ లోకి వచ్చి విజయం సాధిస్తారో లేదో చూడాలి.