కవితకు షాకిచ్చిన అరవింద్

 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఊహించని షాకిచ్చాయి. నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 68వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిట్టింగ్ ఎంపీ కవితపై పసుపు రైతులు తీవ్ర అసంతృప్తితో తమ నిరసనను తెలియజేస్తూ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. కవితపై ఉన్న ఈ అసంతృప్తి బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కుమార్తె ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.