అమరావతికి పట్టిన పీడ విరగడైందట.. జీవీఎల్ పై నెటిజన్ల సెటైర్లు 

బీజేపీ అధిష్టానం కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలనుండి డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్ పుత్రిక పురందేశ్వరి ఉన్నారు. అయితే ఇప్పటివరకు వివిధ పదవులలో ఉన్న రామ్ మాధవ్, మురళీధర్ రావులకు మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ప్రస్తుతానికి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజా లిస్ట్ లో జీవీఎల్ పేరు కనిపించకపోవడం తో సోషల్ మీడియాలో దీని పై అపుడే పెద్ద చర్చ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ ఉన్న సమయంలో ఇసుక పాలసీ నుండి.. అమరావతి వరకు అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వం పై అయన ఇలా విమర్శలు చేయగానే అలా డీల్లీనుండి ప్రత్యక్షమై అబ్బే అలాంటిదేం లేదు.. జగన్ ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తోంది.. అసలు తప్పంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే అంటూ విరుచుకుపడిన సీన్లు గుర్తుకు తెచ్చుకుని మరీ హమ్మయ్య అమరావతికి పట్టిన పీడా విరగడైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమరావతి విషయంలో అయన వ్యవహరించిన తీరుతో ఏపీ ప్రజలలో బీజేపీకి ఉన్న కాస్త సపోర్ట్ కూడా పోయి.. ఆ స్థానంలో ద్వేషం ఏర్పడేలా చేయడంలో అయన సక్సెస్ అయ్యారని కూడా సెటైర్లు పడుతున్నాయి. జీవీఎల్ తెలుగువారైనా యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ.. తాజాగా స్పైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన విషయం తెల్సిందే. దీంతో ఇప్పటి నుండి అయన ఏపీ పైన పెద్దగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని దీంతో ఏపీలో బీజేపీ కూడా కోలుకునే అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో కొందరు ఆశావహుల అభిప్రాయం.