త్రిపురలో ప్రశాంతంగా పోలింగ్

త్రిపుర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అగర్తలాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 60 శాసనసభ స్థానాలున్న త్రిపురలో 59 స్థానాలకు గానూ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 292 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.