ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

 

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్ కోరాపుట్ మార్గంలో నడుస్తున్న సామలేశ్వరి ఎక్స్ ప్రెస్  కెవుటాగూడ వద్ద ట్రాక్ మరమ్మతుల కోసం నిలిచి ఉన్న టవర్ కార్ ను ఢీకొంది, దీనితో రైలు ఇంజను లో మంటలు చెలరేగాయి,  దానితోపటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి, ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయినట్లు సమాచారం. ఈ ప్రమాదం సమయంలో డ్యూటీ లో ఉన్న కెవుటాగూడ స్టేషన్ మాస్టరును సస్పెండ్ చేసినట్లు సమాచారం.