కరోనా మహమ్మారికి బలైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్.. 

తిరుపతి ఎంపీ, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ బుధవారం చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడిన అయన చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. దుర్గాప్రసాద్ 1985లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఒకపక్క న్యాయవాద వృత్తిలో ఉంటూనే అయన రాజకీయాల్లో ప్రవేశించారు. 28 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద రావు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1996లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా అయన పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వై‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.