తమిళనాడులో ఐదుగురు ఏపీ వాసుల దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరునెల్వేలిలో ఆగివున్న బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గుర్తింపు కార్డుల ఆధారంగా మృతులను ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా గుర్తించి..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై గుంటూరు జిల్లా కలెక్టర్ తిరునెల్వేలి కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించి..మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని కోరారు.